News

ఇమేజీ వచ్చిందంటే బాబు వల్లే


మంత్రి అయ్యన్నపాత్రుడు ఆంద్రప్రదేశ్ కు,అమరావతికి ఒక ఇమేజీ వచ్చిందంటే అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇమేజీ వల్లేనని అన్నారు. కర్నూలులో జరిగిన యువభేరీలో విపక్ష నేత జగన్ ప్రసంగంపై ఆయన స్పందించారు.జగన్ అబద్దాలు చెబుతున్నారని, చంద్రబాబు విదేశీయాత్రల వల్ల ఏమి వచ్చిందని అడుగుతున్నారని, ఆయన వల్లే అమరావతికి ఇమేజీ వచ్చిందని అయ్యన్నపాత్రుడు అన్నారు.అమరావతి శంకుస్థాపనకు సింగపూర్ ,జపాన్,చైనా మంత్రులు హాజరయ్యారంటే అది చంద్రబాబు వల్లేనని ఆయన అన్నారు.రష్యా మంత్రి వచ్చి ఒప్పందం చేసుకున్నారంటే చంద్రబాబు విదేశీ పర్యటనల వల్లేనని మంత్రి వ్యాఖ్యానించారు.శ్రీ సిటీ రెండో టోక్యోలా ఉందంటే చంద్రబాబు వల్లేనని అయ్యన్నపాత్రుడు అన్నారు.